CORRESPONDENT - KARIMNAGAR

133.8 కిలోల గంజాయి దగ్ధం: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తెలిపారు.మానకొండూరు మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో  డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీపీలు వేణుగోపాల్, విజయ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం :…

మరింత

మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ‘లియో’తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. కరీంనగర్ ఒకటవ ఠాణా పరిధిలో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు, హాస్టళ్లు,…

మరింత

ఆర్టిజన్ కార్మికుల బహిరంగ సభ ను విజయవంతం చెయ్యండి -కునుసోత్ శ్రీనివాస్ నాయక్

ప్రజాతెలంగాణ-కరీంనగర్ : రాష్ట్రంలోని ఆర్టిజన్ కార్మికుల రెగ్యులర్ కన్వర్షన్ కోసం జూన్ 18న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చెయ్యాలని కునుసోత్ శ్రీనివాస్ నాయక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 25 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారని , గత ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ స్టాండింగ్ రూల్స్ మాత్రమే అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు…

మరింత

లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 3478 కేసుల పరిష్కారం

– పీపీలను అభినందించిన కమీషనర్ ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,478 కేసులను విజయవంతంగా పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఆలం అభినందించారు. కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని , కేసుల పరిష్కారంలో పోలీసు అధికారుల నుంచి ఏదైనా సమన్వయ లోపం కనిపిస్తే…

మరింత

ఘనంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ప్రజాతెలంగాణ – కరీంనగర్:  జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  అని,  ఆయన ఇలాంటి  పుట్టినరోజు వేడుకలు  ఎన్నో జరుపుకోవాలని అన్నారు. గతంలో వారు తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని…

మరింత

మంత్రిని కలిసిన నూతన కమిషనర్ ప్రపుల్ దేశాయ్

ప్రజాతెలంగాణ – కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రపుల్ దేశాయ్ ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వార్తల కోసం : శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

మరింత

శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఫార్మసీ కోర్సుకు ఆమోదం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభించడానికి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు.ఉమేష్‌కుమార్ తెలిపారు.మానేరు డ్యాం సమీపంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫార్మకాలజీ, ఫార్మాసిటిక్స్, ఫార్మాసిటికల్ అనాలసిస్ విభాగాలలో ఒక్కొక్కటిలో 15 సీట్లు చొప్పున మొత్తం 45 సీట్లతో ఎం.ఫార్మసీ కోర్సు ప్రారంభం కానుందని వారు వెల్లడించారు.ఎంతోకాలంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు…

మరింత

కరీంనగర్-తిరుపతి ప్రత్యేక రైలు ప్రారంభం

ప్రజా తెలంగాణ – కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం చేయనున్నట్లు రైల్వే శాఖ గురువారం ప్రకటించింది. జూలై 6 నుండి జూలై చివరివరకు ఈ రైలు నడిపించనున్నారు.వారానికి రెండుసార్లు నడుపుతారుఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 10:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో సోమవారం సాయంత్రం 5:30కి కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం…

మరింత

బాల కార్మికుల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. జడ్జి వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని సూచించారు. చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని…

మరింత

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ రూరల్ : అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాలు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో వినూత్న రీతిలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!