సీనియర్ జర్నలిస్ట్ చంద్ర శేఖర్ మృతి
ప్రజా తెలంగాణ – చొప్పదండి : సీనియర్ జర్నలిస్టు సోంబోజి చంద్రశేఖర్ శుక్రవారం గుండెపోటు తో మృతి చెందారు.ప్రైవేట్ టీచర్…
ప్రజా తెలంగాణ – చొప్పదండి : సీనియర్ జర్నలిస్టు సోంబోజి చంద్రశేఖర్ శుక్రవారం గుండెపోటు తో మృతి చెందారు.ప్రైవేట్ టీచర్ గా విద్యార్థులను తీర్చిదిద్దుతూనే ,జర్నలిజం పై మక్కువతో వివిధ పత్రికలలో రిపోర్టర్ గా సేవలందించిన ఆయన సమాజానికి ఉపయోగపడే పలు వార్త కథనాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా ప్రజా ప్రతినిధులు ,పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పందిస్తూ ఆయన మృతి సమాజానికి,పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. మరింత : చొప్పదండిలో…
ప్రజాతెలంగాణ – చొప్పదండి : చొప్పదండి పట్టణంలో ఆదివారం పద్మశాలి కుల సంక్షేమ సంఘం, యువజన సంఘాల నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా పచ్చునూరి తిరుపతి, అనుమల్ల సత్యం బాధ్యతలు స్వీకరించగా, ప్రధాన కార్యదర్శిగా వల్లాల జగన్, సంయుక్త కార్యదర్శిగా దూస రాము, కోశాధికారిగా దండె సత్యానందం ,. యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా గుండేటి వెంకటరమణ, కోశాధికారిగా పొరండ్ల నితీష్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి,…
ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణం చెందారు. ఇటీవల ఆయన భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య మృతి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ విషాద ఘటనతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. మరిన్ని వార్తల కోసం : అవినీతి నిరోధక శాఖ…
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : బుధవారం కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలతో సదరు సి ఐ ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది. మరిన్ని వార్తల కోసం : రాబోయే ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలి – మాజీ మేయర్ సునీల్ రావు
కలెక్టరేట్ ఎదుట మెడికల్ రిప్రెజెంటేటివ్స్ ధర్నా.. మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపు కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా కొత్త చట్టాలు ఉన్నాయని ధ్వజం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (SPE) యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని డిమాండ్ 24, 25, 26 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించాలని పిలుపు అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ…
ప్రజా తెలంగాణ – కరీంనగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ & సోషల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.చికిత్స పొందుతున్న రోగులకు అరటిపండ్లు, ఆపిల్లతో కూడిన ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో హరికృష్ణ, వేములవాడ అనిల్కుమార్, మీర్జా అనిల్, సాయిచందర్, సంజయ్, సాగర్,…
ప్రజా తెలంగాణ – కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు దోస్త్ మూడో విడత అడ్మిషన్లలో 7629 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కోఆర్డినేటర్ డా.శ్రీరంగ ప్రసాద్ తెలిపారు.విశ్వవిద్యాలయ పరిధిలోని మొత్తం 36,060 సీట్లలో మొదటి, రెండవ విడతలలో 9455 సీట్లు కేటాయించగా, వాటిలో 6730 మంది విద్యార్థులు అడ్మిషన్ ఖరారు చేసుకోగా, ఇంకా 29,330 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మూడో విడత ప్రక్రియ నిర్వహించారు.13 ప్రభుత్వ కళాశాలలలో 1060 మంది విద్యార్థులకు, 3…
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ , ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ వై. సునీల్ రావు లు అన్నారు.ఆదివారం రేకుర్తిలోని పుష్పవల్లి గార్డెన్లో జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ.కిరణ్కుమార్,…
ప్రజాతెలంగాణ – కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 123వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఆదివారం 59వ డివిజన్లో స్థానిక బిజెపి నేతలు , కార్యకర్తలు సమిష్టిగా వీక్షించారు.164వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ది లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డిపల్లి శ్రీనివాస్ (బాలు) మరియు వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.162వ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరెళ్ల ధనలక్ష్మి, 166వ పోలింగ్…
ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఎక్స్గ్రేషియా అందిస్తున్నదని జిల్లా ఉపకార్మిక కమిషనర్ కోల ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన క్రింద ఆగస్టు 26, 2001 నుండి మార్చి 31, 2022 మధ్య ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత…