నవోదయ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

కరీంనగర్: దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు వివరాలు : ఐదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు లేదా ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుకుంటున్నారు. ప్రవేశ పరీక్ష తేదీలు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే…

మరింత

ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీ

ప్రజాతెలంగాణ – కరీంనగర్: జూన్, జులై, ఆగష్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది.జూన్ 1 నుంచి 30 వరకు బియ్యం, చక్కెర పంపిణీ చేస్తామని తెలిపింది. ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత సెప్టెంబర్‌లో మాత్రమే రేషన్ అందుతుందని వెల్లడించింది.ఒకేసారి మూడు నెలల రేషన్ లభించడం తో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే మూడు నెలల బియ్యం ఒకేసారి అందించడం తో పాటు ,సెప్టెంబర్ వరకు రేషన్ తీసుకునే…

మరింత

కౌన్సిలింగ్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత కోపంతో ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ విజయరావు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్‌పై ఉన్న సన్నీతో ఓపికగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేశాడు. యువకుడి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు.సంయమనంతో కౌన్సిలింగ్ చేసి…

మరింత

నేటి ప్రజావాణి రద్దు

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో నేడు (02.06.2025) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మరింత : జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్  

మరింత

నేడే ఎలైట్ వరల్డ్ స్కూల్ ప్రారంభం

ప్రజాతెలంగాణ – కరీంనగర్ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ,అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎలైట్ వరల్డ్ స్కూల్ నేడే ప్రారంభిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ సుదగోని సంతోష్ ఒక ప్రకటన లో తెలిపారు.నర్సరీ నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సిలబస్ తో పాటు ,సీబీఎస్ఈ విద్యా విధానంలో ఉత్తమమైన,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా పలువురు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. సమాజ నిర్మాణం లో విద్య ప్రముఖ…

మరింత

పొగాకు వ్యతిరేక దినోత్సవం పై అవగాహన సదస్సు

ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు.పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, క్యాన్సర్‌కు పొగాకు వాడకం ముఖ్య కారణమని తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని, దీనికి జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం కూడా…

మరింత

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజాతెలంగాణ – కరీంనగర్: వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టి నీటి నమూనాలను పరీక్షించి క్లోరినేషన్ చేయాలని…

మరింత

రాజ్‌కుమార్‌కు ఘన విరమణ సన్మానం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ : సమాచార , పౌర సంబంధాల శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గ సేవలందిస్తున్న దామ రాజ్‌కుమార్‌కు శనివారం కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఘన విరమణ సన్మానం జరిగింది.అసిస్టెంట్ డైరెక్టర్ జి.లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన రాజ్‌కుమార్ అధికారులు, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సమాచార శాఖలో పని చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అవకాశం…

మరింత

జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న అన్ని అంగన్వాడీ కేంద్రాలను జూన్ 10లోగా తప్పనిసరిగా ప్రభుత్వ భవనాలకు మార్చాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.శనివారం స్థానిక సుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన అడిషనల్ కలెక్టర్, ఇదివరకే 63 కేంద్రాలను మార్చినట్లు వెల్లడించారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు…

మరింత

ఎస్‌యూలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలి – చరిత్ర పరిరక్షణ సమితి

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలని కోరుతూ  చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకులు  శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌ను కలిసిన  వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్బంగా రిజిస్ట్రార్  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తొందరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని,వచ్చే విద్యా సంవత్సరం నుండి చరిత్ర మరియు…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!