CM KCR: ప్రగతి భవన్ లో ఘనంగా వినాయకచవితి వేడుకలు

cm KCR Vinayaka Puja

గణనాధుని పండగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈసారి వినాయకచవితి తిథి విషయంలో గందరగోళం ఉండడంతో సోమవారం, మంగళవారం కూడా వినాయకచవితి ఉత్సవాలు జరగనున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రమే వినాయకుడు కొలువుతీరాడు. ముఖ్యంగా తెలంగాణాలోని చాలా ప్రాంతాలలో సోమవారం పండగ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) దంపతులు ప్రగతి భవన్ లో వినాయకచవితి పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయమే జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. విఘ్నేశ్వరుడు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలనీ.. అందరికీ సుఖశాంతులు కాలగాలనీ ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ దంపతులు, వారి కూతురు అలేఖ్యలతో పాటు మంత్రి శీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!