
కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారికి ప్రథమ స్థానం
ప్రజాతెలంగాణ-హుజురాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జరిగిన కళా సమ్మేళన్ 2025లో కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద్-మహేందర్రెడ్డి దంపతుల కుమార్తె నిర్వి రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి , హుజురాబాద్ రూరల్ బిజెపి నాయకులు చిదిరాల శ్రీనివాస్రెడ్డి-రాణి దంపతులు వై.నిర్వి రెడ్డిని అభినందించారు.ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. మరిన్ని వార్తల కోసం : మత్తు…