Solar Eclipse: ఆలయాల మూసివేత.. నిర్మానుష్యంగా మారిన తిరుమల

సూర్యగ్రహణం(Solar Eclipse) కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయం, విజయవాడలోని కనకదుర్గ ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను మూసివేశారు. ఎప్పటిలాగే రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో వైలింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దీంతో పాటు పిఠాపురంలోని పాదగయ ఆలయాలు, కర్నూలులోని సంగమేశ్వర ఆలయాలు కూడా తెరిచి ఉన్నాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మూసివేశారు.

గ్రహణ కాలం ముగిసిన అనంతరం రాత్రి 7:30 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం 8:30 నుంచి 12:30 గంటల వరకు సర్వదర్శనం కల్పించారు. మంగళవారం నాటి సూర్యగ్రహణం దృష్ట్యా సోమవారం దీపావళి ఆస్థానం, తితిదే వీఐపీల బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. గ్రహణం సందర్భంగా లడ్డూల విక్రయాలు, అన్నప్రసాద వితరణ రద్దు చేశారు. వంట గదిని మూసివేసి శుభ్రం చేసి 8:30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుంచి దాదాపు 10 వేల మందికి అల్పాహారం అందించారు. వైభవోత్సవ మండపంలో సుమారు 30 వేల పులిహోర ప్యాకెట్లు, సీఆర్వో పంపిణీ చేశారు. శ్రీవారి ఆలయాన్ని తెల్లవారుజామున మూసివేయడంతో తిరుమలలో నిర్మానుష్య వాతావరణం నెలకొంది.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!