ప్రజాతెలంగాణ – కరీంనగర్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు.పొగాకు వాడకం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, క్యాన్సర్కు పొగాకు వాడకం ముఖ్య కారణమని తెలిపారు. బహిరంగంగా పొగ త్రాగడం నేరమని, దీనికి జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం కూడా నేరమని చెప్పారు.ఈ సందర్భంగా హాజరైన కార్మికులతో పొగాకు వాడకం నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేపట్టారు. ఏ విధమైన చట్టపరమైన సమస్య తలెత్తినా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, జేఏసీ అధ్యక్షుడు కన్నం లక్ష్మన్, వివిధ సంఘాల అధ్యక్షులు నారాయణ, మీస రాజయ్య, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
మరింత :జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్