
తిమ్మాపూర్లో నేర సమీక్ష నిర్వహించిన సీపీ గౌస్ ఆలం
ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు పోలీస్ స్టేషన్లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని…