ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్ పోస్ట్కు ఆర్.ఎస్సై రమేష్ని ఇంచార్జ్గా నియమించారు. ఈ మేరకు గురువారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్.ఎస్సై రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. డ్యామ్ పరిసరాల్లో నిఘా పటిష్టం చేసి, ప్రజలు సురక్షితంగా విహరించే వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం :
ఎస్ యూ ఎల్ఎల్బి పరీక్షల షెడ్యూల్ విడుదల