– 4 వ సెమిస్టరు బ్యాక్లాగ్లకు వన్ టైం ఛాన్స్
ప్రజా తెలంగాణ- కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్ఎల్బి కోర్సుకు సంబంధించిన పరీక్షల ప్రణాళిక ను పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. సురేష్కుమార్ గురువారం వెల్లడించారు. ఎల్ఎల్బి ఆరవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభమై జూన్ 11న ముగుస్తాయని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలని సూచించారు.4 వ సెమిస్టరు బ్యాక్లాగ్ పరీక్షలకు ఈ సారి ప్రత్యేకంగా వన్ టైం ఛాన్స్ కల్పిస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి పేపర్కు రూ. 1,500 చొప్పున రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు.మరిన్ని వివరాలకు సంబంధిత కళాశాలలను సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని డా. సురేష్కుమార్ సూచించారు.
మరిన్ని వార్తల కోసం :