
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
ప్రజాతెలంగాణ – కరీంనగర్ రూరల్ : అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాలు ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, జిల్లాలో వినూత్న రీతిలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల…