ప్రజాతెలంగాణ- కరీంనగర్: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.వెంకటరమణ గురువారం కొత్తపల్లి పిహెచ్సిని సందర్శించారు.హాజరుపట్టిక, అవుట్ పేషెంట్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించి , పిహెచ్సి పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.ఎన్సిడి క్లినిక్లో రెడ్, బ్లూ రిజిస్టర్లు చెక్ చేశారు. హైపర్టెన్షన్, డయాబెటిస్ పేషెంట్ల వివరాలు, మందుల పంపిణీ పరిశీలించారు. ఫార్మసీలో సీజనల్ మందుల స్టాక్ చూశారు.ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గది పరిశుభ్రత, అత్యవసర మందుల లభ్యత పరిశీలించారు. మొదటి ప్రసవాలకు సిజేరియన్ చేయించుకోవడం వల్ల సమస్యలని వివరించి, సాధారణ డెలివరీకి పిహెచ్సిలను వాడుకోవాలని కోరారు.బిఎంఎస్ డాక్టర్లకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చారు.పిఓఎంహెచ్ఎన్ డా.సనజవేరియా, వైద్యాధికారి డా.నజియా, డిపిఓ ఎన్హెచ్ఎం స్వామి, సాగర్, బిఎంఎస్ డాక్టర్లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :