ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి కాన్పుల్లో గర్భవతులను సాధారణ డెలివరీ కోసం ప్రోత్సహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు .సోమవారం ఆయన అధ్యక్షతన మహిళా సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో మాట్లాడుతూ గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ సిజేరియన్ డెలివరీల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను గర్భిణీలకు తెలియజేయాలని సూచించారు.30 సంవత్సరాలకు మించిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ప్రభుత్వ మందులు అందజేయాలని తెలిపారు. తీవ్ర పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి పోషకాహార పునరావాస కేంద్రానికి పంపించాలని సూచించారు.
అంతర్జాతీయ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పిఓడిటి డాక్టర్ ఉమాశ్రీ రెడ్డి మాట్లాడుతూ, కౌమారదశ ఆడపిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని అన్నారు. రుతుస్రావ సమయంలో రోజుకు రెండుసార్లు ప్యాడ్లను మార్చుకోవాలని, శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలని సూచించారు. వాడిన శానిటరీ ప్యాడ్లను సరైన విధంగా నిర్వీర్యం చెయ్యాలని తెలిపారు.ఈ సమావేశంలో పిఓడిటి డాక్టర్ ఉమాశ్రీ రెడ్డి, డిఐఓ డాక్టర్ సాజిద్, పిఓఎంసిహెచ్ డాక్టర్ సనజవేరియా, డిఎంఓ డాక్టర్ శైలేంద్ర, డిపిహెచ్ఎన్ఓ విమల, డిసిఎం రవీందర్ రెడ్డి , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మహిళా సూపర్వైజర్లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :