ప్రజాతెలంగాణ -కరీంనగర్ : సమాచార , పౌర సంబంధాల శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గ సేవలందిస్తున్న దామ రాజ్కుమార్కు శనివారం కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ఘన విరమణ సన్మానం జరిగింది.అసిస్టెంట్ డైరెక్టర్ జి.లక్ష్మణ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, గత 36 సంవత్సరాలుగా అంకితభావంతో విధులు నిర్వర్తించిన రాజ్కుమార్ అధికారులు, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సమాచార శాఖలో పని చేయడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే అవకాశం లభిస్తుంది. రాజ్కుమార్ వృత్తి నిబద్ధతతో సౌమ్యుడిగా, వివాద రహితుడిగా తన పనిని చేసుకున్నారు” అని లక్ష్మణ్కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జేఆర్ఈ ఉషారాణి, రిటైర్డ్ సీఐఏ సత్యనారాయణ, డిప్యూటీ ఇంజనీర్ నర్సింగ్రావు, రిటైర్డ్ అధికారులు పూర్ణచంద్రు, కనకయ్య, భూమయ్య, కార్యాలయ సిబ్బంది శ్రీధర్, శివాని, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.
మరింత :జూన్ 10లోగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ భవనాలకు మార్చాలి – అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్