కౌన్సిలింగ్‌తో యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

ప్రజా తెలంగాణ – కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం బావుపేటకు చెందిన నేరెళ్ల సన్నీ అలియాస్ దయాసాగర్ కుటుంబ సభ్యులతో గొడవపడిన తర్వాత కోపంతో ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ విజయరావు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్‌పై ఉన్న సన్నీతో ఓపికగా మాట్లాడుతూ కౌన్సిలింగ్ చేశాడు. యువకుడి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి పరిస్థితిని చక్కదిద్దాడు.సంయమనంతో కౌన్సిలింగ్ చేసి…

మరింత

లేక్ పోలీస్ ఇంచార్జ్‌గా ఆర్.ఎస్సై రమేష్ నియామకం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్ పోస్ట్‌కు ఆర్.ఎస్సై రమేష్‌ని ఇంచార్జ్‌గా నియమించారు. ఈ మేరకు గురువారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్.ఎస్సై రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. డ్యామ్ పరిసరాల్లో నిఘా పటిష్టం చేసి, ప్రజలు సురక్షితంగా విహరించే వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వార్తల కోసం : ఎస్…

మరింత

తిమ్మాపూర్‌లో నేర సమీక్ష నిర్వహించిన సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు పోలీస్ స్టేషన్‌లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని…

మరింత

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి…

మరింత

పేకాటరాయుళ్ల అరెస్టు

– రూ. 3.65 లక్షల నగదు ,14 సెల్ ఫోన్లు స్వాధీనం ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ :కరీంనగర్ రూరల్ పరిధిలోని రేకుర్తిలోని పేకాట స్థావరంపై బుధవారం సీఐ ఏ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,65,760 నగదు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సి ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని…

మరింత

రాజీ కేసుల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్ పోలీస్ కమిషనర్-ప్రిన్సిపల్ జడ్జి సమావేశం ప్రజా తెలంగాణ – న్యాయ వార్తలు :  కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎస్. శివకుమార్‌ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 14న జరగనున్న లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న రాజీపడే కేసులను కోర్టుల వారీగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కమిషనర్ జడ్జిని కోరారు. సమన్వయ సమావేశంలో పెండింగ్ కేసుల సమీక్ష లోక్ అదాలత్ సన్నద్ధతలో భాగంగా, బుధవారం కోర్టు ఆవరణలోని మీటింగ్…

మరింత

హిందూ ఏక్తా యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు – సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ-కరీంనగర్ క్రైమ్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం  కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర శోభా యాత్ర రూట్‌ను సీపీ గౌస్ ఆలం పరిశీలించారు . బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు .యాత్ర సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా…

మరింత

భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం

– బాధితులకు అందిస్తున్న సేవలు, కేసుల పురోగతిపై సమీక్ష ప్రజా తెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని…

మరింత

సత్ప్రవర్తన చెందని రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ – కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్: పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేరచరితులు సత్ప్రవర్తనతో మెలగాలని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు . పరివర్తన చెందకుండా పాత పద్ధతులను అనుసరిస్తూ నేరాల్లో భాగస్వాములైతే పీడీ యాక్ట్‌ను అమలు చేసి సంవత్సరాల తరబడి జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.శుక్రవారం కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, క్షణికావేశాలతో అనాలోచిత…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!