కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో చరిత్ర, టూరిజం విభాగాలు ఏర్పాటు చేయాలని కోరుతూ చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకులు శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్ను కలిసిన వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్బంగా రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాతవాహనుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తొందరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని,వచ్చే విద్యా సంవత్సరం నుండి చరిత్ర మరియు టూరిజం విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చరిత్ర పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి, వ్యవస్థాపకులు డా. సందవేణి తిరుపతి, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుజ్జెటి తిరుపతి పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం :