భారత్ చారిత్రక వృద్ధి: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ!

– సవాళ్లు, అవకాశాల మధ్య వినూత్న ప్రస్థానం ప్రజా తెలంగాణ – న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2025 వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం, 2025 చివరి నాటికి భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (Nominal GDP) పరంగా జపాన్‌ను అధిగమించి ఈ ఘనతను సాధించబోతోంది. ఒక దశాబ్దం క్రితం, అంటే 2014లో ప్రపంచంలో…

మరింత

కరీంనగర్‌లో ఆటో యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టు

ప్రజా తెలంగాణ -కరీంనగర్ : హైదరాబాదులో ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభ జరుగుతున్న సందర్భంలో కరీంనగర్‌లోని ఆటో యూనియన్ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ఉన్నారు. ఆటో యూనియన్ సభ్యులు, పలువురు విచ్చేసి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా…

మరింత

తిమ్మాపూర్‌లో నేర సమీక్ష నిర్వహించిన సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు పోలీస్ స్టేషన్‌లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని…

మరింత

జిల్లా విద్యాధికారి పై వేటు

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వార్తల కోసం : ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి

మరింత

ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి…

మరింత

ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా తెలంగాణ – వెబ్ డెస్క్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వ్యవసాయ శాఖ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.గత సంవత్సరం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా మొత్తం 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సీఎం తెలిపారు. 10.5 లక్షల మంది…

మరింత

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి – డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి కాన్పుల్లో గర్భవతులను సాధారణ డెలివరీ కోసం ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు .సోమవారం ఆయన అధ్యక్షతన మహిళా సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో  మాట్లాడుతూ గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ సిజేరియన్ డెలివరీల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను గర్భిణీలకు తెలియజేయాలని సూచించారు.30 సంవత్సరాలకు మించిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా…

మరింత

బహిరంగ ప్రదేశంలో జూదం: ఐదుగురు అరెస్ట్

ప్రజాతెలంగాణ -కరీంనగర్ రూరల్ : మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగురుపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.10,460 నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తము మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన…

మరింత

బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు – రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి

ప్రజాతెలంగాణ – కరీంనగర్ క్రైమ్ : బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి హెచ్చరించారు . సోమవారం కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలూ తెరిచి ఉండే బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతోందన్నారు . దీని వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ,మద్యం సేవించిన వారు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొందరు గంజాయికి…

మరింత

తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యం- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

ప్రజాతెలంగాణ -కరీంనగర్: తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు .కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తానాకాన్’ 11వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.వైద్యం సేవా దృక్పథంతో కూడినదని, వైద్యులు సమాజ శ్రేయస్సు కోరుకుంటారని , వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆరోగ్య మంత్రి దామోదర్‌రాజనర్సింహ దృష్టికి…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!