అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నాం – సంచార ముస్లిం జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ

ప్రజా తెలంగాణ -కరీంనగర్ : రిజర్వేషన్లపై అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నామని సంచార ముస్లిం జాగృతి సంఘ స్థాపకులు ఎం.డి. షబ్బీర్ అన్నారు.బీసీ-ఈ ధ్రువీకరణ పత్రాలు అర్హులైన వారికంటే ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వారే పొందుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం చర్చా కార్యక్రమంలో నేతృత్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, బీసీ-ఈ రిజర్వేషన్ల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు.

నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుర్రహమాన్ మాట్లాడుతూ , “ఖాన్‌లు, పఠాన్‌లు, మొఘల్‌లు మా రిజర్వేషన్లు అక్రమంగా లబ్ధి పొందడం వల్ల సంచార ముస్లింలు తీవ్రంగా నష్టపోతున్నారు” అని తెలిపారు.కోశాధికారి ఎం.డి. షాదుల్లా మాట్లాడుతూ “సంచార ముస్లింలు ఐక్యంగా ఉండి పోరాటాలు చేసినప్పుడే మన హక్కులు, రిజర్వేషన్లు పొందగలుగుతాం,” అని ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ ,సంఘ స్థాపకులు ఎండి షబ్బీర్ యాకూబ్ , ఉపాధ్యక్షుడు చాంద్ పాషా, పాషా భాయ్, కోశాధికారి ఎండి షాదుల్లా , ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ,సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం :

ప్రపంచ  హైపర్ టెన్షన్ డే పై అవగాహన కార్యక్రమం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!