లేక్ పోలీస్ ఇంచార్జ్‌గా ఆర్.ఎస్సై రమేష్ నియామకం

ప్రజాతెలంగాణ -కరీంనగర్ క్రైమ్ : కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లేక్ పోలీస్ అవుట్ పోస్ట్‌కు ఆర్.ఎస్సై రమేష్‌ని ఇంచార్జ్‌గా నియమించారు. ఈ మేరకు గురువారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్.ఎస్సై రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. డ్యామ్ పరిసరాల్లో నిఘా పటిష్టం చేసి, ప్రజలు సురక్షితంగా విహరించే వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వార్తల కోసం : ఎస్…

మరింత

ఎస్ యూ పరిధిలో దోస్త్ మొదటి విడత కేటాయింపులు పూర్తి

ప్రజా తెలంగాణ – కరీంనగర్ : ఎస్ యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ప్రవేశాల మొదటి విడత సీట్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిందని విశ్వవిద్యాలయ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీరంగప్రసాద్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. మొత్తం 36,540 సీట్లకు నిర్వహించిన ఈ ప్రక్రియ లో మొదటి విడత కేటాయింపుల్లో కేవలం 5,931 సీట్లు మాత్రమే కేటాయించబడ్డాయని ఇంకా 30,609 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రభుత్వ కళాశాలల్లో 297 మంది…

మరింత

రాజీవ్ యువ వికాసం యూనిట్లకు పటిష్ట కార్యాచరణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

– జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రజాతెలంగాణ- వెబ్ డెస్క్ : రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్కు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథక పురోగతిని సమీక్షించిన ఆయన , 8 వేల కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన…

మరింత

కరీంనగర్‌లో ఆటో యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టు

ప్రజా తెలంగాణ -కరీంనగర్ : హైదరాబాదులో ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు మహాసభ జరుగుతున్న సందర్భంలో కరీంనగర్‌లోని ఆటో యూనియన్ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ఉన్నారు. ఆటో యూనియన్ సభ్యులు, పలువురు విచ్చేసి సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా…

మరింత

తిమ్మాపూర్‌లో నేర సమీక్ష నిర్వహించిన సీపీ గౌస్ ఆలం

ప్రజాతెలంగాణ- తిమ్మాపూర్ : కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం తిమ్మాపూర్ పోలీస్ సర్కిల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, సీసీసీ ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు పోలీస్ స్టేషన్‌లను తరచుగా సందర్శించి ఎస్సైల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి నెలా స్టేషన్ వారీగా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆకస్మిక పరిస్థితులకు లాఠీ, హెల్మెట్ వంటి రైట్ గేర్ సిద్ధంగా ఉంచుకోవాలని…

మరింత

జిల్లా విద్యాధికారి పై వేటు

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వార్తల కోసం : ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి

మరింత

ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మంగళవారం పిఓఎంసి హెచ్ డాక్టర్ సనజవేరియాతో కలిసి కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మనగర్ బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రాలలోని హాజరు పట్టిక, అవుట్ పేషెంట్ విభాగం, లేబరేటరీ, ఫార్మసీ స్టోర్లలోని మందుల నిల్వలు మరియు రికార్డులను పరిశీలించారు.13 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులలో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించారు. షుగర్ వ్యాధి…

మరింత

ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి – సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా తెలంగాణ – వెబ్ డెస్క్ : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వ్యవసాయ శాఖ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.గత సంవత్సరం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా మొత్తం 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సీఎం తెలిపారు. 10.5 లక్షల మంది…

మరింత

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి – డీఎంహెచ్‌ఓ వెంకటరమణ

ప్రజాతెలంగాణ- కరీంనగర్ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదటి కాన్పుల్లో గర్భవతులను సాధారణ డెలివరీ కోసం ప్రోత్సహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు .సోమవారం ఆయన అధ్యక్షతన మహిళా సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో  మాట్లాడుతూ గైనకాలజీ డాక్టర్ చేత హెల్త్ చెకప్ చేయిస్తూ సిజేరియన్ డెలివరీల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను గర్భిణీలకు తెలియజేయాలని సూచించారు.30 సంవత్సరాలకు మించిన వారందరికీ అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా…

మరింత

బహిరంగ ప్రదేశంలో జూదం: ఐదుగురు అరెస్ట్

ప్రజాతెలంగాణ -కరీంనగర్ రూరల్ : మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగురుపల్లి గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అక్రమంగా జూదం ఆడుతున్న ఐదుగురిని సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.10,460 నగదు మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తము మానకొండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగిందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన…

మరింత
టాప్ కి వెళ్ళండి
Follow by Email
Copy link
URL has been copied successfully!